మార్పుకు వ్యతిరేకంగా
తూర్పుకు వ్యతిరేకంగా
తీర్పు చెప్పి
ఒప్పుకొమ్మంటున్నావు నువు
జైళ్ళు రైళ్ళను నడిపించగలిగితే
జైళ్ళు మనసుకు దళ్ళు కట్టగలిగితే
జైళ్ళు పోరాటం నోళ్ళు మూయించగలిగితే
పశ్చిమాన సూర్యుడు ఉదయిస్తే
పశ్చాత్తాపం ప్రకటిస్తాను మై లార్డ్
- జులై 16, 1977లో వి.వి. రాసిన ʹఅండర్ టేకింగ్ʹ కవిత నుండి
మనసు పొరల్లో అణిగిపోయిన మాటల్ని తట్టి లేపి నడిపించి చూడాలి
కుంట్లు పడిన కాళ్లను లేపుకొని రెక్కలు ఆకాశంలోకి ఎగరగలవేమో చూడాలి
ఎండిపోయిన చెవులకు ఎవరి మాటలో కాదు
నా మాటలూ
కరువు తరవాత చినుకులంత కొత్తగానే వుంటాయి
మరచిపోయిన వానాకాలాన్ని ఆకాశం
మళ్ళీ చదువుకుంటే ఎంత బాగుంటుందో
నా కటౌ శబ్దమయ ప్రపంచంలో
నేలమీద మొలకెత్తాలని వుంది
- మార్చి 3, 1988లో రాసిన ʹమాటలుʹ కవిత నుండి
ఇలాంటి కవితలు రాసిన రచయిత తన కుటుంబంతో ఫోనులో ఒక వాక్యాన్ని పూర్తి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని ఊహించుకోండి. ఆయన కవితలు చాలా శక్తివంతమైనవి. విప్లవంలో జరిగిన వాస్తవ సంఘటనలకు ప్రభుత్వం ఆ కవితలను కారణంగా ప్రకటించింది. నలభై సంవత్సరాలపాటు సాహిత్యంలో ప్రొఫెసర్ గా , ఆధునిక తెలుగు కవితా ఆద్యుడిగా, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా వరవరరావు అందరికీ తెలిసిన వ్యక్తి.
ఆయన జులై 11న తలోజ జైలు నుండి తన సహచరితో మాట్లాడినప్పుడు ఆ మాటలు అసంబద్ధంగా వుండడానికి కారణం ఆయన వయసు కాదు. 33 సంవత్సరాల వయసునుండీ, వి.వి.గా అందరికీ పరిచితమైన ఈ వ్యక్తి జైళ్ళకు వెళ్ళటం రావడం కొనసాగుతూనే వున్నది. ఆయనపై పెట్టిన 25 కేసులు కొట్టివేయబడ్డాయి.
అయితే ఇప్పుడు జైలు నిర్బంధంలో ఆయన అనుభవిస్తున్న స్థితి గతంలో లాంటిది కాదు. 1973 నుండి 1989 వరకు, తిరిగి 2005 నుండి 2006 వరకు ఆయన కటకటాల వెనక వున్నారు. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ వుద్యమం ఉచ్ఛదశలో వున్నది. ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా అణచివేసింది. అలాంటి అరాచకపు రోజుల్లో కూడా, ఆయన తన విప్లవభావాలను దాచుకోని సమయంలో కూడా ఆయన పట్ల జైలు అధికారులు ఈనాటి మహారాష్ట్ర ప్రభుత్వంలాగా వ్యవహరించలేదు. ఇప్పుడు భీమా కోరెగావ్ కేసు వచ్చేటప్పటికి సుప్రీమ్ కోర్టు నుండి క్రిందివరకు న్యాయవ్యవస్థ ముద్దాయిల ప్రాథమిక హక్కులను కాపాడడానికి నిరాకరించడాన్ని గమనించాలి.
కోవిడ్-19 జైళ్ళల్లో తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో కూడా ఆయనకూ, సుధాభరద్వాజ, సోమాసేన్. గౌతమ్ నవాల్కలకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానాలు నిరాకరించడం విచారించాల్సిన విషయం. మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అనారోగ్య స్థితి గురించి అనేకమంది చేస్తున్న విజ్ఞప్తులను పెడ చెవిన పెట్టింది. అదలా వుంచితే వరవరరావు భాగస్వామిగా సాగిన ప్రత్యేక తెలంగాణా వుద్యమం విజయాన్ని సాధించి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరవాత కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగాని, ఆ రాష్ట్రం తరఫున కేంద్రం హోంశాఖ సహాయమంత్రిగా వున్న కిషన్ రెడ్డిగాని నోరు మెదపడానికి, జోక్యం చేసుకోవడానికి నిరాకరించడాన్ని అందరూ ప్రశ్నించాలి.
వరవరరావు ʹప్రాణాలు ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును కాపాడతామని ప్రమాణం చేసిన వాళ్ళ చేతుల్లో వున్నాయి.ʹ
తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
నిజమైన వీరులు నేల నుంచి వస్తారు1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది....... |
చరిత్ర - చర్చభగత్సింగ్ ఇంక్విలాబ్కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
Save the life of the Indian writer and activist Varavara Rao!His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
నోటీసుకు జవాబుగా చాటింపునిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది/
వాడ అంటే వెలివాడనే/
అంటరాని వాళ్లు ఉండేవాడ/
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది/
ఇప్పుడది ఇంతింతై ... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
వాగ్ధాటి కాశీపతి1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపల్లి....
... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |