సరిగ్గా ఏడాది క్రితం ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఒక వ్యాసం రాశారు. హిందుత్వవాదులు ఆ వ్యాసం రాసినందుకు ఆయన మీద, దానిని అచ్చువేసినందుకు సంపాదకుడి మీద, ప్రచురణకర్త మీద కేసు పెట్టారు. బ్రాహ్మణధర్మం పట్ల ఆయన వ్యక్తపరుస్తున్న భావాల మీద చర్చ చేయాలని వాళ్ళు అనుకోలేదు. ఆయనను దూశిస్తూ, బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పరమ అప్రజాస్వామిక రాతలు రాస్తున్నారు. ఇటీవల విజయవాడలో సి.ఐ.టి.యు ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన చేసిన ప్రసంగం వివాదాస్పదం చేశాక బ్రాహ్మణ సంఘాలు ఆయన మీద ఏకంగా దాడి వంటి ఆందోళనకు దిగాయి. ఆయనకు బెదిరింపు ఫోన్లు కూడా వస్తున్నాయి. ధబోల్కర్, పన్సారే, కలబుర్గి వంటి ఆలోచనాపరుల హత్యలు, దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలపై జరుగుతున్న దాడుల నుండి దీనిని వేరుగా చూడలేము.
మత సెంటిమెంట్ల పేరు మీద గత కొంత కాలంగా భావాలను, ఆలోచనల్ని నేరమయం చేసే కుట్ర జరుగుతున్నది. నీ రాతలు, నీ మాటలు, నీ ఆలోచనలు మా సెంటిమెంట్లను గాయపరుస్తున్నాయి అని చెప్పి నీ మీద భౌతిక దాడి చేయగల వాతావరణాన్ని సృష్టించడమే కాదు, హిందూ అతివాదశక్తులు దానికి సమ్మతిని కూడగడుతున్నారు. హిందుత్వవాదులు ఏమైనా మాట్లాడొచ్చు. కర్రలు, కత్తులు, తుపాకులు ప్రదర్శించి వాళ్ళకు గిట్టని సమూహాలను ఏకంగా నిర్మూలిస్తామని కూడా అనవచ్చు. అదేమీ కేసు నమోదు చేయగలిగే నేరం కాదు. కానీ భిన్నాభిప్రాయం ప్రకటించి వాళ్ళ ʹసున్నితమైనʹ మనోభావాల్ని ఎవరైనా గాయపరిస్తే అది నేరమవుతుంది. అధికారికంగా కాకపోతే అనధికారికంగా వారిని శిక్షించొచ్చు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఆలోచనల మీద, భిన్న సంస్కృతుల మీద, విశ్వాసాల మీద అనధికార పోలీసింగ్, ప్రైవేటు గ్యాంగుల దౌర్జన్యాలు కేంద్రంలో బి.జె.పి అధికారంలోకి వచ్చాక విపరీతంగా పెరిగిపోయాయి. మూక సంస్కృతిని రెచ్చగొట్టి సంఘపరివార్ దాని అంగబలాన్ని పెంచుకునే పనిలో ఉంది. దీని మీద రచయితలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా కనీసం వినగలిగే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ జరుగుతున్న సంఘటనల్లో ప్రభుత్వ కుట్రపూరిత భాగస్వామ్యం ఉందని చెప్పక తప్పదు. ఆటాగే రాష్ట్ర ప్రభుత్వాల నిశ్శబ్ద ఆమోదం కూడా ఉందని చెప్పాలి.
ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, సంఘపరివార్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల ప్రజాస్వామికవాడులందరూ ఒక్కటి కావాలి. భావాల సంఘర్షణ ద్వారానే సమాజం వికసిస్తుంది. అది లేని నాడు వ్యక్తి, సమాజం ఆలోచనను కోల్పోయి గిడసబారిపోతుంది. స్వతంత్ర భావాలు తిరుగాడని చోట ప్రజలు క్రియారహితం అయిపోతారు. రాజ్యం దయాదాక్షిన్యాల మీద ఆధారపడి అణగారిపోతారు. సరిగ్గా రాజ్యం అదే కోరుకుంటుంది.
ప్రొ.కంచె ఐలయ్య గాని, మరెవరైనా గాని, వారి భావాలను అంగీకరించలేకపోతే రాత ద్వారా, మాట ద్వారా ఖండించవచ్చు. చర్చ చేయవచ్చు. ఇవేవీ కాకుండా తిట్లకు, బెదిరింపులకు, దౌర్జన్యాలకు దిగేవారి ఉద్దేశం సమాజంలో భిన్నాభిప్రాయాలను అణచివేసి నియంతృత్వాన్ని స్థాపించాలనుకోవడం. అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఘనమైన భారత చరిత్ర అని సంఘపరివార్ ఏమైనా చెప్పొచ్చు గాక, ఈ నేల మీద చార్వాకులు, బుద్ధుడు మొదలు ఫూలే, పెరియార్, అంబేడ్కర్ దాకా ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ఆలోచనాధార, ధికార సంస్కృతి కొనసాగుతున్నది. ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తాము. కనుక మేము ప్రొ.కంచె ఐలయ్య పక్షాన, గాయపడుతూ నెత్తురోడుతున్న విశ్వాసాల పక్షాన, మావంటి రచయితలకు ప్రాణప్రదమైన భావ ప్రకటనా స్వేచ్చ పక్షాన నిలబడతాము.
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శంఅసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ ....... |
ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
ఇది మనిషి మీద యుద్ధం సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ఉనా స్వాతంత్ర నినాదంఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ... |
నల్లమలపై అణుబాంబుకృష్ణా, పెన్నా ఆదరువుతో బతుకుతున్న ప్రజానీకం మాత్రం నల్లమల చల్లని నీడలేకపోతే బతకడం కష్టం.మొట్టమొదట యురేనియం కృష్ణను కలుషితం చేస్తుంది.ఈ విధ్వంసం ఆమ్రాబాద్..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |